• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

25, అక్టోబర్ 2010, సోమవారం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సందేశం...24.10.2010.


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, గుంటూరు లో సంపత్ నగర్ లో ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేందుకు విచ్చేసారు. వారిని కలిసి కొన్ని విషయాలలోగల సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. మీతో పంచుకోవలని అనిపించింది.
నేను: నమస్కారం అండీ.. నా పేరు టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ నుంచీ వచ్చాను. నేను తెలుగులో "పద్య మంజూష " అనే బ్లాగు నడుపుతున్నాను. మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.
మొదటగా.. నేడు సమిష్టి కుటుంబాలు అంతరించాయి.అన్నీ మైక్రో కుటుంబాలే. ఎవర్నీ ఎవరూ గౌరవిచడం లెదు. కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధశ్రమాల పాలవుతున్నారు. ఏమిటి? ఈ పరిస్తితి ఎందుకొచ్చింది?


సా.ష. శర్మ : నిజమే! కొంత కలియుగ ప్రభావం ఉంది. ఈ పరిస్తితి మెరుగవ్వలంటే, ఏ ఒక్కరో అనుకుంటె కుదరదు. తాతలు తండ్రులు కొడుకులు.. ఇలా వంశం లో ప్రేమ.. అనేది రావాలి. మన మన: ప్రవృత్తి లో మార్పు రావాలి.

నేను: గతం లో పాఠశాలల్లో.. నీతి కధలూ,డ్రిల్లూ, క్రాఫ్టు లాంటివి ఉండి..విద్యార్ధి ని సర్వతోముఖంగా తీర్చి దిద్దేట్టు ఉండేవి. ఇప్పుడు అన్నీ కార్పోరేటు విద్యా సంస్తలు. నేటి విద్యార్ధి పరిస్తితి ఎమిటి?
సా.ష. శర్మ : నేడు వ్యాపార దృక్పధం అన్ని రంగాల్లో ఉంది. డబ్బు సంపాదన ధ్యేయం గా తల్లి దండ్రులు కూడా..ఆ పరుగు లో భాగం పంచుకుంటున్నరు.విద్యా బోధనలో నైతికతకు ప్రాధాన్యత రాను రానూ తగ్గించటమే అన్ని అరిష్టాలకీ మూలకారణం.విద్యకి ప్రథమ ప్రయోజనం సంస్కారం. అంతిమ ప్రయోజనం సంపాదన. ప్రథమ ప్రయోజనాన్ని విద్యావ్యవస్థ విస్మరించకూడదు. తమ పిల్లలు కొత్తగా కనిపించాలనేది పెద్దల తాపత్రయం. అలా చెయ్యలేకపోతే వెనుకబడినట్లు భావించటం వల్ల విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పబ్ సంస్కృతి , ఆకర్షణలు , వ్యామోహాలను పెంచే వాతావరణం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి ఏకైక ఔషథం ఆథ్యాత్మిక యోగ జీవితం.


నేను: నేటి యువత లో దైవ చింతన తగ్గింది. పై పై మెరుగులకు క్షణిక సుఖాలకు ఆకర్షితులవుతున్నారు. యువత లో స్త్రీలలో కొంత మటుకూ ఈ దైవ చింతన ఉంది. మొగ వారిలో కూడా ఈ దైవ చింతన.. పాప భీతి ఉంటె.. సమాజం ఇంకా మెరుగ్గా ఉంటుందేమో కదా?

సా.ష.శర్మ: నిజమే!! ఐతే పూర్తిగా అంతరించి పోలేదు. వాళ్ళు కొంచెం వయసు వచ్చాక తెలుసుకుంటున్నారు. అలాగే. తల్లి దండ్రులూ..తమ బిజీ జీవితం లో ఉండక పిల్లలకు అన్నీ విడమర్చి చెప్పాలి. వారికి చెప్పగా చెప్పగా మంచి మర్గాన పడతారు కదా.. మార్పు అన్ని దిశల నుండీ రావాలి.


నేను : మీకు నచ్చిన గ్రంధం ఏమిటి? విద్యలన్నిటిలోనూ గొప్ప విద్య ఏది? ఏ గ్రంధం చదవకపోటే మనం ఎంతో కోల్పొయినట్టుగా లెక్క.

సా.ష.శర్మ :"భగవద్గీత" ’అథ్యాత్మ విద్యా విద్యానాం’ అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమాత్ముని తెలుసుకునే విద్యే అసలైన విద్య. ఆథ్యాత్మికత తర్కానికి, యుక్తికి లొంగనిది. సాధన , ఉపాసన వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల భగవద్గీత చదివి తీరాల్సిన గ్రంధం.

నేను: చివరిగా..పద్యకవిత మరుగున పడిపోతోంది. వచన కవితలూ..నానీలూ., నానోలూ..గేయ కవితలూ.. పద్యాన్ని మింగేస్తున్నాయి. పద్యం బ్రతికి బట్ట కడుతుందా?
సా.ష.శర్మ: తప్పకుండా.. బ్రతికే ఉంటుంది. ప్రతి దశలోనూ..కొత్త కొత్త ప్రక్రియలు రావడం మమూలే కదా. అంత మాత్రాన పాత పద్యం మూల పడినట్టు కాదు.(నాకు శర్మ గారు రాసిన "రామ చంద్ర ప్రభూ.." అన్న శతకాన్ని బహూకరించి హామీ ఇచ్చారు)చాలా సంతోషం స్వామీ..శెలవు. నమస్కారము"
ఆయన ఆశీస్సులు తీసుకుని "రీ-చార్జి" అయి బయటకు వచ్చాను.

15, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆధునిక సాహిత్య నిర్మాత- వీరేశలింగం పంతులు...

ఈ మధ్య కార్యాలయపనుల వత్తిడి వల్ల నేను బ్లాగు పోస్టులు చెయ్యలేకపోయాను. తెలుగు పొయిట్రీ అనే సైటు లో ఉన్న వీరేశలింగం గారి గురించిన వ్యాసం ఆకట్టుకొంది. మీతో పంచుకోవలని అనిపించింది. చదవండి.

వీరేశలింగం పంతులు బహు యోజన శాఖా సంయుతమయిన వటవృక్షం వంటివారు. ఆంధ్ర దేశమున, ఆధునిక చరిత్రయందు వారి స్థానము ఎంతో విశిష్టమయినది.. వీరితోనే ఆధునిక యుగం ప్రారంభమయిందని చెప్పుకోవచ్చును.. వీరికి పూర్వమే ఆయా సాహిత్య ప్రక్రియలు తెలుగునా వెలయుటకు శ్రీకారం చుట్టిన మహనీయులు కొందరున్నను ఒక ఉద్యమము వలె ఆయా రంగాములందు కృషి చేసిన మేధావి వీరేశలింగం పంతులు గారే... ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటికి స్థితిని, ప్రాచుర్యమును కల్పించిన వారు వీరేశలింగం...
వీరేశలింగం పంతులు పున్నమ్మ,సుబ్బారాయుడు, దంపతులకు 1848 ఏప్రిల్ 16 న జన్మించారు.. వీరి విద్యాభ్యాసం వీధి బడిలోనే జరిగింది.. 1861 లో రాజ్యాలక్ష్మమ్మ గారితో వివాహమయింది.. కేశవ చంద్రసేన్, ఆత్మురి లక్ష్మి నృశింహం గార్ల ఉపన్యాసాలు, భోదనలు వల్ల కందుకూరి బ్రహ్మ మత ప్రభావితులయ్యారు.. 1868 -69 కాలంలోనే రెండు శతకాలు రచించారు. 1870 లో సర్వ కళాశాల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై అదే సంవత్సరంలో శుద్ధాంధ్ర నిరోష్త్య నిర్వచన నైషధం రచించారు.. 1871 లో రాజమహేంద్రవరం దొరతనం వారి మండల పాటశాలలో సహాయోపాధ్యాయ పదవిలో నియమించపడ్డారు..ఆ తర్వాత కోరంగిలో ఇంగ్లిషు పాటశాలకి ప్రదానోపాధ్యాలుగా పనిచేసారు..
కందుకూరి వారు తెలుగులోకి ఆధునిక ప్రక్రియలలో చాలా వరకు 'నేనే మొదట రచించితి ' అని స్వీయ చరిత్రలో పేర్కొన్నారు.. తొలి నాటకం, తొలి ప్రహసనం, తొలి వచన ప్రభందం, తొలి కవుల చరిత్ర, తొలి శాస్త్రీయ గ్రందాల నిభందనం- కందుకూరి రాసినట్లు తెలుస్తున్నా అంతకుముందే నాటకరచన, వచన ప్రభంద రచన లేకపోలేదు.. అయితే వివిధ ప్రక్రియల్ని చేపట్టి వాటికి ప్రాధాన్యాన్ని, ప్రాచుర్యాన్ని, కలిగించింది కందుకూరి మాత్రమే..ఆ ధృక్పదంతో ఆధునిక సాహిత్య నిర్మాతగా పేర్కొనడం సమంజసమే...
''తిగకొటికలదాయా తెల్లయేరున్నరాయా
సెగకను గల దంతా చేదు గొన్నట్టి జంటా
సొగసుల తలకట్టా, సూడులంగొట్టు దిట్టా
జిగియర చెలికాడా చిలకరా రౌతుసూడా ''
1870 వ సంవత్సరం ప్రాంతంలో చిత్ర కవిత్వంతో, సృన్గారంతో 'రసిక జన రంజనం' అనే ప్రభందం రచించారు. తర్వాత స్వీయ చరిత్రలో అటువంటివి రచించడం సరికాదని కాలక్రమేణా మానేసానని పేర్కొన్నారు..
నాటకరచన లో దృశ్యకావ్య ప్రధాన ప్రయోజనమయిన 'ప్రదర్శన' కి ప్రాధాన్యం ఇచ్చిన నాటకాన్ని రచించడంలో కందుకూరే ప్రధములు.. 1880 లో పంతులు 'ది కామెడి ఆఫ్ ఎర్రర్స్ ' నాటకాన్ని ''చమత్కార రత్నావళి ' అనే సంస్కృత రుపకానువాదం కూడా చేసారు..పౌరాణిక ఇతివృత్తంతో దక్షిణ గోగ్రహం, 'సత్య హరిశ్చంద్ర' అనే నాటకాన్ని రచించారు.మాళవికాగ్ని మిత్రం మొదలైన పన్నెండు నాటకాలలో బ్రమ్హ వివాహం, స్త్రీ పునర్వివాహం, సభా నాటకం, వంటి సాంఘిక రూపకాలు ఉన్నాయి.. అసంపూర్ణంగా రాసిన నాటకాలన్ లెక్కిస్తే మొత్తం దాదాపు ఇరవై నాటకాలు రచించినట్లు రమాపతిరావు గారు పేర్కొన్నారు..
నవలా రచనలో కందుకూరి వీరేశలింగం ప్రప్రధములని చాలామంది అభిప్రాయం.. .. నరహరి గోపాల కృష్ణమశెట్టి రచించిన ' శ్రీ రంగ రాజ చరిత్రము' తొలి తెలుగు నవల అని కొందరి అభిప్రాయం. కానీ వీరేశలింగం రచనలపై పరిశోదన చేసిన అక్కిరాజు రమాపతిరావు తొలి సాంఘిక నవల '' రాజశేఖర చరిత్ర'' అని సోదాహరణంగా తులనాత్మకంగా వివరించారు. పంతులుగారు నవలలు ;
1 రాజశేఖర చరిత్ర
2 సత్యరాజా పుర్వదేశ యాత్రలు,
3 . సత్యవతీ చరిత్రము
4 . చంద్రమతి చరిత్రము.
ఇందులో మొదటి రెండు నవలలు పురుషుల్ని దృష్టిలో పెట్టుకుని రాయగా, తర్వాతి రెండు నవలలు స్త్రీలను దృష్టిలో ఉంచుకుని రాసారు...
ప్రహసనాలు:- తెలుగులో ప్రహసనాలు కన్డుకురివారే ఆద్యులు.ఆంగ్ల సాహిత్య ప్రభావంవల్ల రాజకీయ దురాచారాలను వినోదకరంగా, సంభాషనాత్మకంగా , వివరించి మాన్పించాలనే సంఘ సంస్కరణ దృష్టి వల్ల కందుకూరి ప్రహసనాలు రచించారు... చాలావరకు ప్రహసనాలు 'వివేక వర్దిని' పత్రికలో ప్రచురితమయ్యాయి.. ' పెళ్లి తర్వాత పెద్ద పెళ్లి'' , లోకోత్తర వివాహము'. అనే ప్రహసనాలలో వేస్యభిమానం, చాదస్తపు ఆచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్థం, అనేవి అత్యంత సహజంగా వ్యంగ్య వైభవంతో చిత్రీకరించా పడ్డాయి.. అంతే కాకుండా 'వినోద తరంగిణి' లో వ్రుద్హ వివాహం వల్ల నష్టాలు వివరించపడ్డాయి.. అపూర్వ బ్రహ్మ చర్య ప్రహసనం, విచిత్ర వివాహ ప్రహసనం' మహా భాధిర ప్రహసనం, మొదలైనవి ఆంగ్లంలో 'farce' లు ఆధారంగా రచించబడ్డాయి.. వీరి తర్వాత ప్రహసనాల పరంపరను చిలకమర్తివారు కొనసాగించారు...
కధారచన పంతులుగారు మహిలాభ్యుదయంకోసం చేపట్టారు.. స్త్రీ విద్యని ప్రోత్సహించడానికి సాంఘిక దురాచారాల్ని తెలియజేయడానికి 'నీతి కధలు' గా రచించారనిపిస్తుంది.. స్త్రీల పత్రిక 'సతీ హితబోధిని' నడుపుతూ ఈ కధల్ని అందులో ప్రచురించేవారు.. స్త్రీలకోసం, బాలబాలికల కోసం నీతి భోధ ప్రధానంగా '' నీతి కదా మంజరి'' చిత్ర పటాలతో రెండు భాగాలుగా ప్రచురించారు.. మొత్తం 158 కధలతో ప్రతి కధ చివర ఒక నీతి పద్యంతో మనోహరంగా రచించాబదినట్లు విమర్శకులు ప్రశంసించారు
వ్యాసరచన విషయంలో పంతులుగారు ఉపన్యాసము, వ్యాసములను, పదములను, సమానార్ధకములుగాను.,పర్యాయ పదములుగాను, గ్రహించిరనుట ఉదాహరణములు చుపవచ్చును. ప్రత్యేక సమావేశములందు గాని, ప్రార్ధనా సమాజమునందు కానీ ,ఉపన్యసించిన విషయములనే గాక, వివిధ విషయములపై రచించిన వ్యాసములను కూడా పంతులు ఉపన్యాసములుగానే వ్యవహరించిరి'' కందుకూరి వారు వివిధ అంశాలపై రచించిన వ్యాసాలూ దాదాపు నూట తొంబై దాకా ఉన్నాయి.. సత్యవాదిని, వివేకవర్ధిని, సతీహిత బోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా, మొదలైన పర్త్రికాలలో ప్రచురింపబడి తర్వాత సంపుటాలుగా ప్రచురింప పడ్డాయి.. ఇంతే కాకుండా పంతులుగారు స్వీయ చరిత్ర, కూడా ప్రప్రధమంగానే రచించుకుని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు.
ఆరుద్ర గారు అన్నట్లు '' అదే౦ చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్టం చేసి దేశాభివ్రుద్ధిని, భాషాభివృద్ధిని,సాధించిన మనోబల భీములలో పంతులు గారు ప్రప్రధములు.. రెండోవారు గురుజాదవారు...ఇటువంటి ఉజ్వల చరిత్రుడిని ఈ బిరుదుతో వర్ణించినా అది సమగ్రమే అవుతుంది.. వీరు అభినవాంధ్రకు 'ఆధ్యబ్రహ్మ"