• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

25, అక్టోబర్ 2010, సోమవారం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సందేశం...24.10.2010.


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, గుంటూరు లో సంపత్ నగర్ లో ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేందుకు విచ్చేసారు. వారిని కలిసి కొన్ని విషయాలలోగల సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. మీతో పంచుకోవలని అనిపించింది.
నేను: నమస్కారం అండీ.. నా పేరు టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ నుంచీ వచ్చాను. నేను తెలుగులో "పద్య మంజూష " అనే బ్లాగు నడుపుతున్నాను. మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.
మొదటగా.. నేడు సమిష్టి కుటుంబాలు అంతరించాయి.అన్నీ మైక్రో కుటుంబాలే. ఎవర్నీ ఎవరూ గౌరవిచడం లెదు. కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధశ్రమాల పాలవుతున్నారు. ఏమిటి? ఈ పరిస్తితి ఎందుకొచ్చింది?


సా.ష. శర్మ : నిజమే! కొంత కలియుగ ప్రభావం ఉంది. ఈ పరిస్తితి మెరుగవ్వలంటే, ఏ ఒక్కరో అనుకుంటె కుదరదు. తాతలు తండ్రులు కొడుకులు.. ఇలా వంశం లో ప్రేమ.. అనేది రావాలి. మన మన: ప్రవృత్తి లో మార్పు రావాలి.

నేను: గతం లో పాఠశాలల్లో.. నీతి కధలూ,డ్రిల్లూ, క్రాఫ్టు లాంటివి ఉండి..విద్యార్ధి ని సర్వతోముఖంగా తీర్చి దిద్దేట్టు ఉండేవి. ఇప్పుడు అన్నీ కార్పోరేటు విద్యా సంస్తలు. నేటి విద్యార్ధి పరిస్తితి ఎమిటి?
సా.ష. శర్మ : నేడు వ్యాపార దృక్పధం అన్ని రంగాల్లో ఉంది. డబ్బు సంపాదన ధ్యేయం గా తల్లి దండ్రులు కూడా..ఆ పరుగు లో భాగం పంచుకుంటున్నరు.విద్యా బోధనలో నైతికతకు ప్రాధాన్యత రాను రానూ తగ్గించటమే అన్ని అరిష్టాలకీ మూలకారణం.విద్యకి ప్రథమ ప్రయోజనం సంస్కారం. అంతిమ ప్రయోజనం సంపాదన. ప్రథమ ప్రయోజనాన్ని విద్యావ్యవస్థ విస్మరించకూడదు. తమ పిల్లలు కొత్తగా కనిపించాలనేది పెద్దల తాపత్రయం. అలా చెయ్యలేకపోతే వెనుకబడినట్లు భావించటం వల్ల విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పబ్ సంస్కృతి , ఆకర్షణలు , వ్యామోహాలను పెంచే వాతావరణం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి ఏకైక ఔషథం ఆథ్యాత్మిక యోగ జీవితం.


నేను: నేటి యువత లో దైవ చింతన తగ్గింది. పై పై మెరుగులకు క్షణిక సుఖాలకు ఆకర్షితులవుతున్నారు. యువత లో స్త్రీలలో కొంత మటుకూ ఈ దైవ చింతన ఉంది. మొగ వారిలో కూడా ఈ దైవ చింతన.. పాప భీతి ఉంటె.. సమాజం ఇంకా మెరుగ్గా ఉంటుందేమో కదా?

సా.ష.శర్మ: నిజమే!! ఐతే పూర్తిగా అంతరించి పోలేదు. వాళ్ళు కొంచెం వయసు వచ్చాక తెలుసుకుంటున్నారు. అలాగే. తల్లి దండ్రులూ..తమ బిజీ జీవితం లో ఉండక పిల్లలకు అన్నీ విడమర్చి చెప్పాలి. వారికి చెప్పగా చెప్పగా మంచి మర్గాన పడతారు కదా.. మార్పు అన్ని దిశల నుండీ రావాలి.


నేను : మీకు నచ్చిన గ్రంధం ఏమిటి? విద్యలన్నిటిలోనూ గొప్ప విద్య ఏది? ఏ గ్రంధం చదవకపోటే మనం ఎంతో కోల్పొయినట్టుగా లెక్క.

సా.ష.శర్మ :"భగవద్గీత" ’అథ్యాత్మ విద్యా విద్యానాం’ అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమాత్ముని తెలుసుకునే విద్యే అసలైన విద్య. ఆథ్యాత్మికత తర్కానికి, యుక్తికి లొంగనిది. సాధన , ఉపాసన వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల భగవద్గీత చదివి తీరాల్సిన గ్రంధం.

నేను: చివరిగా..పద్యకవిత మరుగున పడిపోతోంది. వచన కవితలూ..నానీలూ., నానోలూ..గేయ కవితలూ.. పద్యాన్ని మింగేస్తున్నాయి. పద్యం బ్రతికి బట్ట కడుతుందా?
సా.ష.శర్మ: తప్పకుండా.. బ్రతికే ఉంటుంది. ప్రతి దశలోనూ..కొత్త కొత్త ప్రక్రియలు రావడం మమూలే కదా. అంత మాత్రాన పాత పద్యం మూల పడినట్టు కాదు.(నాకు శర్మ గారు రాసిన "రామ చంద్ర ప్రభూ.." అన్న శతకాన్ని బహూకరించి హామీ ఇచ్చారు)చాలా సంతోషం స్వామీ..శెలవు. నమస్కారము"
ఆయన ఆశీస్సులు తీసుకుని "రీ-చార్జి" అయి బయటకు వచ్చాను.

6 కామెంట్‌లు:

astrojoyd చెప్పారు...

సా.ష. శర్మ : నిజమే! కొంత కలియుగ ప్రభావం ఉంది. ఈ పరిస్తితి మెరుగవ్వలంటే, ఏ ఒక్కరో అనుకుంటె కుదరదు. తాతలు తండ్రులు కొడుకులు.. ఇలా వంశం లో ప్రేమ.. అనేది రావాలి. మన మన: ప్రవృత్తి లో మార్పు రావాలి./deeni gurunchi avasaramaina vivarananu aananu meeru endulu adagaledo mari...

అజ్ఞాత చెప్పారు...

ఇవి మీ ధర్మసందేహాలు, వారి సమాధానాలా?
"సొల్లు" అంటారు దీన్ని. మ్యాటర్ ఏమి లేదు.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

"అజ్ఞా_" గారికి...మీకు "సొల్లు" అ"ని"పించింది కొంత మందికి ఉపయోగం, అలాగే, మీ బ్లాగు లో మీ విషయాలు చూసి "వేస్ట్ ఫెలో" అనుకుంటారు కొందరు. ఎవరి టేస్టు వారిది. మీకు నచ్చినవి మీకు సొల్లుగా అనిపించనివి మాత్రమే పెట్టలేము కదా..

హనుమంత రావు చెప్పారు...

శ్రీ శర్మగారు చెప్పినట్టు పిల్లలు సరిగా వుండాలనుకుంటే ముందుగా
పెద్దలు తమ అలవాట్లను ఆదర్శప్రాయంగా వుంచుకోవాలి. అంతే
కాకుండా తలిదండ్రులు పిల్లలకు మంచిమాటలు చెప్తూవుంటే వారి
నడవడిక బాగుంటుంది. శ్రీ శర్మగార్ని కలసి పదిమందికీ పనికివచ్చే విషయాలు
సేకరించి అందించిన మీరు అభినందనీయులు..............దినవహి.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

హనుమంత రావు గారూ! నిజమే! నా అభిప్రాయాలను.. ఇంటర్వ్యూ ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకునే మీ లాంటి పెద్దలు ఉన్నారు గాబట్టే.. ప్రచురించడం జరిగింది. మీ కామెంట్సు ఎప్పుడూ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ..ధన్యవాదాలు. శెలవు.

వానా చెప్పారు...

మిత్రులొకరు దేశం లోని అన్ని భాషల్లోని రామాయణాలకు ఆంగ్లానువాదాలను సేకరించి వాటిని స్టడీ చేస్తున్నారు. తెలుగు రామాయణాలేవీ ఆంగ్లం లోకి రాలేదని వారు చింతిస్తూ, ఎవరైనా అలా అనువదిస్తే బాగుండునని తలచారు. మొల్ల రామాయణం క్లుప్తంగా ఉంటుంది, తెలుగు , ఆంగ్లం రెండూ వచ్చిన వారు ఈ పని చేస్తే బావుంటుంది అన్నారు. ఆంగ్ల పుస్తకాలకి ఎడిటర్స్ తప్పులు సవరిస్తారు కనక ఆంగ్లం లో అద్భుత పాండిత్యం అవసరం లేదని చెప్పారు.