• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, మే 2010, సోమవారం

గురు లఘువు ల గురించి.

పద్యాలు రాయాలంటే మొదట గురువులు, లఘువులు గుర్తించగలగాలి. పద్య రచన లో ఇది మొదటి అంశం. ఆంధ్ర బాషకు అక్షరాలు 56 వీటికి మళ్ళీ గుణింతాల ద్వారా లెక్కకు మించి అక్షరాలు తయారవడం మనందరికీ సుపరిచితమే!
అయితే గురువు అంటే ఎమిటి? లఘువు అంటే ఎమిటి? అనే విషయాన్ని చూద్దాము.
ఏక మాత్ర కాలం లో ఉచ్చరించ గలిగేది లఘువు అంటారు. ద్విమాత్రా కాలాన ఉచ్చరించ గలిగేది గురువు అంటారు. అర్ధం కలేదా? ఒక మాత్రా కాలం అంటే ఒక చిటిక వేసే కాలం అనుకోండి. చేతితో ఒక చిటిక వేసే కాలం లో లఘువు ను పలక వచ్చు. రొండు చితికలు వేసే కాలం గురువు పలకడానికి పడుతుంది.
లఘువు అంటే తేలికైనది, సులువైనది. గురువు అంటే కొంచెం కష్తమైనదీ, పలకడానికి దీర్ఘంగా ఉండి, కఠినంగా ఉన్నది అని కూడ అంటారు.
గురువు కు గుర్తు గా "U" అనే గుర్తును వాడుతారు.లఘువు కు గుర్తు గా "I" అనే గుర్తును వాడుతారు.
మొదట మన అక్షరమాల లోని అక్షరాలను చూద్దాము.
లఘువులు: అ,ఇ,ఉ,ఋ,ఎ,ఒ,క,ఖ,గ,ఘ,చ,ఛ,జ,ఝ,ట,ఠ,డ,ఢ,ణ మొదలుకొని క్ష వరకు.
గురువులు: ఆ,ఈ,ఊ, ౠ,ఏ, ఐ, ఓ, ఔ, అం, అః
మొదట వీటి వ్యవహారాన్ని కాస్తా గమనించండి.
తర్వాతి పాఠం లో గుణింతాలు వాటి ద్వారా వచ్చే, గురు, లఘువులు చూద్దాము.

పద్య రచన మొదలెడదామా?

పద్యం అనగానే కొన్ని కీలక విషయాలు ఉంటాయి.
౧. గురు లఘువుల నిర్దేశ్యం.
౨.గణ విభజన చేసుకోవాలి.
౩. యతి నియమం చూడాలి.
౪. ప్రాస నియమం చూడాలి.
౫. పాద నియమం.
వీటిని మనం విడి విడి గా నేర్చుకుందాము.

తెలుగు బాష కు కమ్మదనం పద్యమే!

మన తెలుగు బాష కు కమ్మదనం తెస్తుంది పద్యం. మనం పల్లెటూర్లలో జనం "జండాపై కపిరాజు" అని పాడుకోవడం ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. పండితులు కానీ, పామరులు కానీ, అందరికీ పద్యం అంటే ఇష్టమే. ఒక్క పద్యమైనా రాని తెలుగు వాడిని చూపించండి చూస్తాము. తెలుగు వారి వేయి సంవత్సరాల తార తరాల సంపద మన పద్యం. కానీ ఇటీవల గద్య కవితలు, హైకూలు, నానీలు, నానోలు వచ్చేసి, ఈ పద్యాన్ని కొంచెం వెనక్కు నెట్టాయి. ఛందో భూయిష్టమైన పద్యం అవడం తో దాన్ని విడిచి పెట్టారు.
క్రీస్తు పూర్వమే సంస్కృత శ్లోకాలు ఉన్నప్పటికీ, మన తెలుగు పద్యం లాగ వాటిల్లో యతి ప్రాసలు లేవు. ౧౦ వ శతాబ్దం లో నన్నయ్య తెలుగు లో ఆంధ్ర మహా భారతం రచించి
తెలుగు పద్యాలకు శ్రీకారం చుట్టాడు. అంతకు ముందు కూడా తెలుగు రచన వున్నది. అయితే తెలుగు పద్యాన్ని తీర్చి దిద్దిన ఘనత మాత్రం నన్నయ్య భట్టారకుల వారిదే అని చెప్పవచ్చు.

తెలుగు లో మొట్టమొదటి పద్యం.

తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందఱో పెద్దలు పద్యాలు రాసి ఉంటారు, అయితే శాసనాలు లభించిన మేరకు యీ పద్యం మొదటిది గ ఆర్యులు చెప్తూ ఉంటారు.
యీ తరువోజ రాసిన మహానుభావునికి నమస్కరాలర్పిస్తూ మనం పద్య రచనకు సాగుదాం.

12, మే 2010, బుధవారం

పద్యం రాయాలంటే ఏమి కావాలి?

మొదట మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు చెప్తాను. తెలుగు బాష మీద ఆసక్తి ఉండాలి. తెలుగు లో మంచి పదాలను వాడడం వాటి అర్ధాలు బాగా తెలిసి ఉండాలి. వేమన శతకం, సుమతి శతకం లాంటి శతకాలను బాగా చదవాలి. వీలైనన్ని పద్యాలను చదవండి. పద్య రచన అంత కష్టం ఏమీ కాదు. కొంచెం శ్రద్ధ, ఆసక్తి కావాలి. గణాలు, ఛందస్సు అంటూ భయపడకండి. అవన్నీ ఆసక్తి వుంటే అన్నీ వచ్చేస్తాయి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. తెలుగులో (వొకాబులరీ) వీలైనన్ని పర్యాయ పదాలు, నానార్ధాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఏదైనా గ్రంధం, ప్రభందం చదవండి. ఉదా: భారతం, భాగవతం లాంటి గ్రంధాలు, వాటి హృదయోల్లాస వ్యాఖ్యానాలూ, చదివి పద్య రచన లోని మాధుర్యాన్ని గమనించండి. అలాగే, చిన్నయ సూరి బాల వ్యాకరణం చదవండి. సంధులు, సమాసాలూ, వంట బట్టించుకోండి. అయితే ఇవేవీ లేకుండా, కూడా మీకొచ్చిన సులభ భాషలో కూడా రాయొచ్చు. వచ్చే పోస్టింగు లో కాస్తా వివరంగా చెప్తాను.