• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, మే 2010, సోమవారం

గురు లఘువు ల గురించి.

పద్యాలు రాయాలంటే మొదట గురువులు, లఘువులు గుర్తించగలగాలి. పద్య రచన లో ఇది మొదటి అంశం. ఆంధ్ర బాషకు అక్షరాలు 56 వీటికి మళ్ళీ గుణింతాల ద్వారా లెక్కకు మించి అక్షరాలు తయారవడం మనందరికీ సుపరిచితమే!
అయితే గురువు అంటే ఎమిటి? లఘువు అంటే ఎమిటి? అనే విషయాన్ని చూద్దాము.
ఏక మాత్ర కాలం లో ఉచ్చరించ గలిగేది లఘువు అంటారు. ద్విమాత్రా కాలాన ఉచ్చరించ గలిగేది గురువు అంటారు. అర్ధం కలేదా? ఒక మాత్రా కాలం అంటే ఒక చిటిక వేసే కాలం అనుకోండి. చేతితో ఒక చిటిక వేసే కాలం లో లఘువు ను పలక వచ్చు. రొండు చితికలు వేసే కాలం గురువు పలకడానికి పడుతుంది.
లఘువు అంటే తేలికైనది, సులువైనది. గురువు అంటే కొంచెం కష్తమైనదీ, పలకడానికి దీర్ఘంగా ఉండి, కఠినంగా ఉన్నది అని కూడ అంటారు.
గురువు కు గుర్తు గా "U" అనే గుర్తును వాడుతారు.లఘువు కు గుర్తు గా "I" అనే గుర్తును వాడుతారు.
మొదట మన అక్షరమాల లోని అక్షరాలను చూద్దాము.
లఘువులు: అ,ఇ,ఉ,ఋ,ఎ,ఒ,క,ఖ,గ,ఘ,చ,ఛ,జ,ఝ,ట,ఠ,డ,ఢ,ణ మొదలుకొని క్ష వరకు.
గురువులు: ఆ,ఈ,ఊ, ౠ,ఏ, ఐ, ఓ, ఔ, అం, అః
మొదట వీటి వ్యవహారాన్ని కాస్తా గమనించండి.
తర్వాతి పాఠం లో గుణింతాలు వాటి ద్వారా వచ్చే, గురు, లఘువులు చూద్దాము.

కామెంట్‌లు లేవు: