• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

2, జూన్ 2010, బుధవారం

గురు లఘువులు.

ఈ గురు లఘువుల లో కొన్ని రకాల బీజాక్షరాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను.
అ,ఆ,ఎ,క,చ,ట,త,ప, య, ష... వీటిని వాయు బీజాక్షరాలు అంటారు.
ఇ,ఈ,ఐ,ఖ,ఛ,ఠ,ధ,ఫ,ర,స.... వీటిని అగ్ని బీజాక్షరాలు అంటారు.
ఉ, ఊ,ఓ,గ,జ,డ,ద,బ,ల,హ ... వీటిని భూ బీజాక్షరాలు అంటారు.
ఋ, ౠ,ఔ,ఘ,ఝ,ఢ,ధ,భ,వ,ళ ... వీటిని జల బీజాక్షరాలు అంటారు.
అం,ఙ,ఞ,ణ,న,మ,అ: ... వీటిని గగన బీజాక్షరాలు అంటారు.
వాయు, అగ్ని,గగన బీజాక్షరాలు పద్యమొదట పెడితే మంచిది కాదు అంటారు.
భూమి, జల బీజాక్షారాలు మొదట నిలిపితే శుభం అంటారు ఆర్యులు.
శ్రీ, కం,కః,నిన్,నున్, ఐత్వము,ఓ త్వములతో గూడినవి గురువులు గా భావించాలి.

ఇక, "కా" గుణింతము ద్వారా, గురు లఘువు లను గుర్తు పట్టగాలిగితే అదే మాదిరి మిగిలిన గుణింతాలను అభ్యాసం చెయ్యవచు.
లఘువులు: క,కి,కు, కృ, కె, కొ .
గురువులు: కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ, కం, క:
ఒత్తు ఉన్న అక్షరాలు రొండు రకాలు.
౧. సంయుక్తాక్షరాలు: ఒక హల్లు కింద వేరొక హల్లుకు సంబందించిన గుర్తు ఉంచడం.
ఉదా: ప్మ, క్య, వ్య, త్న మొదలైనవి.
౨.ద్విత్వాక్షరాలు: ఒక హల్లు కింద అదే హల్లు కు సంబందించిన గుర్తులు ఉంచడం.
ఉదా: క్క, ప్ప, మ్మ, య్య, త్త మొదలైనవి.
వీటి పరమార్ధం ఏమిటంటే, ఈ సంయుక్త మరియూ ద్విత్వాక్షరాల ముందు ఉన్న అక్షరాలూ గురువులు గా భావించాలి. మరి ఈ సంయుక్త, ద్విత్వక్షరాలను మాత్రం లఘువులు గా పరిగణించాలి. గురు లఘువులను గుర్తించడం ఎలాగో వచ్చే పాఠాల్లో చూద్దాము.

కామెంట్‌లు లేవు: