• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

3, జూన్ 2010, గురువారం

గురు లఘువుల విషయం లో కీలకమైన అంశాలు (గుర్తుంచుకోదగ్గవి)

గురు లఘువుల విషయం చాల ముఖ్యమైనది కాబట్టి, ఒక సారి ముఖ్యమైన విషయాలను, మననం చేసుకుందాం.
౧. ఏక మాత్ర (ఒక చిటికె) సమయం లో పలుక గలిగేవి లఘువులు.
ఉదా: క,కి,కు, కృ, కె, కొ . మొదలైనవి.
౨. ద్వి మాత్రా కాలం లో పలుకగాలిగేవి గురువులు.
ఉదా: కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ, కం, క: మరియూ
సున్నా, విసర్గ, న కార పొల్లు, ఐత్వం, ఓత్వం తో కూడిన అక్షరాలూ, శ్రీ అనే అక్షరం గురువులు.
ఇంకా... ద్విత్వక్షరాలకు, సంయుక్తాక్షరాలకు ముందున్న ఆక్షరములు గురువులు అవుతాయి. ఒక వేళ, ఆ (ద్వి లేక సంయుక్త) అక్షరానికి దీర్ఘం ఉన్నట్టయితే, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. ఉదా: ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ).
పై విషయాలను జాగ్రత గా గమనించండి. వచ్చే పోస్టింగు లో గణ విభజన చేద్దాము.

కామెంట్‌లు లేవు: