• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, మే 2010, సోమవారం

తెలుగు బాష కు కమ్మదనం పద్యమే!

మన తెలుగు బాష కు కమ్మదనం తెస్తుంది పద్యం. మనం పల్లెటూర్లలో జనం "జండాపై కపిరాజు" అని పాడుకోవడం ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. పండితులు కానీ, పామరులు కానీ, అందరికీ పద్యం అంటే ఇష్టమే. ఒక్క పద్యమైనా రాని తెలుగు వాడిని చూపించండి చూస్తాము. తెలుగు వారి వేయి సంవత్సరాల తార తరాల సంపద మన పద్యం. కానీ ఇటీవల గద్య కవితలు, హైకూలు, నానీలు, నానోలు వచ్చేసి, ఈ పద్యాన్ని కొంచెం వెనక్కు నెట్టాయి. ఛందో భూయిష్టమైన పద్యం అవడం తో దాన్ని విడిచి పెట్టారు.
క్రీస్తు పూర్వమే సంస్కృత శ్లోకాలు ఉన్నప్పటికీ, మన తెలుగు పద్యం లాగ వాటిల్లో యతి ప్రాసలు లేవు. ౧౦ వ శతాబ్దం లో నన్నయ్య తెలుగు లో ఆంధ్ర మహా భారతం రచించి
తెలుగు పద్యాలకు శ్రీకారం చుట్టాడు. అంతకు ముందు కూడా తెలుగు రచన వున్నది. అయితే తెలుగు పద్యాన్ని తీర్చి దిద్దిన ఘనత మాత్రం నన్నయ్య భట్టారకుల వారిదే అని చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు: