• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

14, జులై 2010, బుధవారం

తెలుగు వ్యాకరణ గ్రంధాలు - ఒక పరిశీలన

తెలుగు భాష చరిత్ర గురించి అప్పుడప్పుడూ కొంచెం కొంచెం తెలుసుకోవడం ఆసక్తి దాయకంగా ఉంటుందని భావిస్తూ.. "తెలుగు లో వ్యాకరణ గ్రంధాలు" వాటి గురించి తెలుసుకుందాం. ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు పద్య రచనకు దోహదం కలిగిస్తాయి. మొదట ఛందో గ్రంధాలలోనే, అక్కడక్కడ వ్యాకరణ అంశాలను చర్చించడం కనపడుతుంది. మనకు లభించే ఛందో గ్రంధాల్లో " కవిజనాశ్రయము" మొదటిది. దీని కాలం వివాదాస్పదము అయినా..కేతన రచించిన "ఆంద్ర భాషా భూషణం" కంటే ప్రాచీనమైనదని చరిత్ర కారుల అభిప్రాయం. కవి ఎవరో కూడా తెలియ రాక పోవడం గమనించ దగ్గ విశేషం. దీనిలో దోషాదికారం అనే విషయం చెప్తూ.. విసంధి, దుస్సంధి, కుసంధి మొదలైన వ్యాకరణ విశేషాలు ఉదాహరణలతో తెలుప బడ్డాయి.

కేతన రాసిన "ఆంద్ర భాషా భూషణం" పద్య వ్యాకరణ గ్రంధం. ఇందులో ముఖ్యంగా వ్యాకరణ విశేషాలు తెలుపబడ్డాయి. తర్వాత విన్నకోట పెద్దన "కావ్యాలంకార చూడామణి" లో ఛందో అంశాలతో బాటుగా, వ్యాకరణ విశేషాలు పలు పేర్కొన బడినవి.

నన్నయ భట్టు దే అని నమ్ముతున్న " ఆంద్ర శబ్ద చింతామణి" పైన పేర్కొన్న రెండు గ్రందాల కంటే కూడా మంచి సూత్రా నియమాలతో రాయబడింది. ఐతే, దీనిలో ఛందస్సు గురించి లేక పోవడం కొరతే! కొందరు దీనికి పాఠ బేధాలు కల్పించి, అప్పకవీయానికి మూలమైన "చింతామణి" తయారు చేసారు.అందువల్లనే, అప్పకవీయం.. ప్రామాణిక చదో గ్రంధంగా రూపు దిద్దుకుంది. దానికి ముందే తెలుగు లో వచ్చిన "బాల సరస్వతీయం", అహోబల పండితీయ రూపం లో చింతామణికి వ్యాఖ్యానం వచ్చే వరకూ కూడా. బల సరస్వతీయానికి ప్రాముఖ్యత కలుగలెదు.

మనం ఈ గ్రంధాలను ముఖ్యంగా, 1) ఫద్య వ్యాకరణ గ్రంధాలు 2) సంస్కృత శ్లోక బద్ధ వ్యాకరణ గ్రంధాలు 3) సంస్కృత సూత్ర బద్ధ వ్యాకరణాలు 4) చింతామణి కి వ్యాఖ్యానాలు 5) తెలుగు సూత్రములతో రచించిన వ్యాకరణాలు 6) గద్య మయములైన వివరణాత్మక వ్యాకరణాలు గా విభజించ వచ్చు.

ఐతే బహుళ ప్రచారాన్ని పొందిన వాటిల్లో.. కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం, విన్నకోటపెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి, అనంతా మాత్యుని చందో దర్పణం, ముద్దరాజు రామన రాసిన కవిజన సంజీవిని కొన్ని. వీటిల్లో ఏమేమి రాసారో తర్వాత తెలుసుకుందాము. కావ్య రచనకు మార్గ నిర్దేశనం గా తెలుగులో వ్యాకరణ రచన ఆరంభమయింది. దానితో భాషా స్వరూప స్వభావాలు నిరూపించ బడ్డాయి. సంధి సమాసాలలో ద్వైరూప్య సాధనకై రూపాంతరాలున్న తావులను అన్వేషించి చందస్సు లో వివిధ స్తలాలలో, గణ యతి ప్రాసాదులకు అనువుగా వాటిని వాడుకునేందుకు కవులకు శాస్త్ర నిర్దేశనము చేయుట వ్యాకరణ గ్రంధాల ప్రధాన ఉద్దేశ్యము.
చివరిగా ఒక మాట. "యదధీత మవిఙాఞతం నిగదేనైవ శబ్ద్యతే, అనగ్నా వివ శుష్కైధో న తజ్జ్వలరి కర్హిచిత్ తస్మా దనర్ధకం మాధీగీష్మహీ త్యధ్యేయం వ్యాకరణం"అంటె..మన జాతి ప్రాచీన సాహిత్యాన్ని తద్ద్వారా మన సంస్కృతి సాంప్రదాయలను నిలబెట్టుటకు వ్యాకరణం ఎంతో ప్రయోజనం.




1 కామెంట్‌:

vrdarla చెప్పారు...

తెలుగు వ్యాకరణ గ్రంథాలు - ఒక పరిశీలన వ్యాసంలో చాలా అక్షరదోషాలు కనిపిస్తున్నాయి. ఉదా: భేదాలు అని ఉండాలి. కానీ, బేధాలు అని రాసారు. అలాగే ‘‘బల సరస్వతీయానికి ప్రాముఖ్యత కలుగలెదు.’’ -‘‘దోషాదికారం’’
ఇలా... చాలా దోషాలు ఉన్నాయి. దీన్ని చూడకుండా ప్రచురించారనుకుంటున్నాను.