• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

1, డిసెంబర్ 2012, శనివారం

పంచ పాండవులు ఉపదేశాలు - సుభాషితములు


పంచ పాండవులు ఉపదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాము.

ధర్మరాజ ఉవాచ
శ్లో: సత్యం మాతా పితా ఙాఞనం ధర్మో భ్రాతా దయా సఖా,
శాంతి: పత్నీ క్షమా పుత్త్ర షడ్డేతే మమ బంధావా:
తా! సత్యము, తల్లి, ఙాఞము తండ్రి, ధర్మము సోదరుడు, దయ, మిత్రుడు,శాంతి భార్య, ఓరిమి కొడుకు  - ఈ ఆరుగురును నాకు బంధువులు అని ధర్మ రాజు చెప్పెను.

భీమ ఉవాచ
శ్లో: ప్రాణం వాపి పరిత్యజ్య మనమే వాభి రక్షతు,
అనిత్యో భవతి ప్రాణో మాన ఆచంద్ర తారకం.
తా! ప్రాణమును విడిచి అయినసరే మానమునే రక్షించుకొనవలెను. ఏమనగా ప్రాణము నిత్యం గాదు. మానము ఆచంద్ర తారార్కముగా ఉండును.


అర్జున ఉవాచ:
శ్లో! నిమంత్రణోత్సావా విప్రా గావో నవతృణో త్స్వవా:
భర్త్రాగ్రగమోత్పవ నార్య: సో2హం కృష్ణ: రణొత్సవ:
తా! కృష్ణా! బ్రాహ్మణులు పరుల ఇంటి భోజనము ఉత్సవముగా గలవారు, గోవులు లేత గడ్డి ఉత్సవముగా గలవి. స్త్రీలు పెనిమిటి రాక ఉత్సవము గా గలవారు. నేను యుద్ధమే ఉత్సవముగా గలవాడిని.


నకుల ఉవాచ

శ్లో! మాతృవ త్పరదారంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవత్సర్వ భూతాని య: పశ్యతి స పండిత:
తా! పరస్త్రీలను తల్లివలెను, పరధనమును మన్ను వలెను, సకలభూతములను తనవలెను చూచువాడే పండితుడు.

సహదేవ ఉవాచ:
శ్లో: అనిత్యాణి శరీరాణి విభవో నైవ శాశ్వత:
నిత్యం సన్నిహితో మృత్యు: కర్తవ్యో ధర్మసంగ్రహ:
తా! దేహములు నిత్యములు గావు. ఐశ్వర్యము శాశ్వతము కాదు. మృత్యువు నిత్యమును సమీపించియే యుండును. కాబట్టి ధర్మమును సంపాదించుకోవలెను అని సహాదేవుడు చెప్పెను.





1 కామెంట్‌:

astrojoyd చెప్పారు...

ధర్మరాజు చెప్పిన-మీరు రాసిన తార్పర్యంలో మూడు తప్పులున్నవి సవరించగలరు