• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

13, నవంబర్ 2012, మంగళవారం

భవభూతి మన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తా?


"ఉత్తరే  రామ చరితే భవభూతిర్విష్యతే" అని ప్రసిద్ధి గాంచిన భవభూతి మహాకవి మన ఆంధ్ర ప్రదేశ్ వాడేనని డా.సంగంభట్ల నరసయ్య గారు అంటున్నారు. కొన్ని సాక్షీభూతమైన విశేషాలూ ఆ వాదాన్ని బలపరుస్తున్నాయి.

అవేమిటో... వాటి కధా కమామిషూ చూద్దాము మనం కూడా..

భవభూతి మహావీర చరిత్ర, మాలతీ మాధవం, ఉత్తర రామ చరిత్ర అనే మూడు నాతకాలు రాసాడు. ఈయన పరమ నిష్తా గరిష్టుడు. ఈనకే శ్రీకంఠుడని ఇంకో పేరు కూడా ఉంది.  కన్యా కుబ్జాన్ని పాలించిన యశొవర్మ ఆస్తానం లో ఉండడం వలన మనవారు ఆయన కాలం క్రీ!శ! 680-750 ప్రాంతం వాడని భావిస్తున్నారు.

ఆయన విదర్భ దేశం లో  పదంపురం లో నివసిస్తూ రాజాశ్రయం కోరి వలస వెళ్ళిన బ్రాహ్మణ పండితుడు.నాగపూర్ నుండి ఉత్తర తెలంగాణా గోదావరి హద్దు వరకూ ఉండే ప్రాంతం అన్న మాట. ఈయనకు 150 సం.వ. తర్వాత వాడైన పంప మహా కవి తనూ పద్మపుర నివాసినని చెప్పుకున్నాడు. పంప కవి " ఇన్నపు పోళల్గా లిళ్ళా, పోళల్గే నాళ్కు యుగ డోలం, వసుమతి పద్మపురం ఏక చక్ర బహు ధాన్య ఎంబనాళ్కు  పెసరాదుడు" అన్నాడు. అంటే.. వసుమతి, పద్మపుర, ఏకచక్రపుర,బహుధాన్యపుర అని ఈ భోధన్ కు పేర్లు ఉన్నాయి అన్నాడు.

భవభూతి తరచూ గోదావరి నదీ ప్రస్తావన చేస్తాడు. గోదావరి అంటే ఆయనకు ఎనలేని ప్రీతి. తన రొండు నాటకాలలో  (మహా వీర చరిత్ర, ఉత్తర రామ చరిత్ర) గోదావరి ని వర్ణించడం కమనీయం గా ఉంది. "తదీయ గోదావరీ హ్రదాన్నిష్క్రమ్య" అంటాడు. ఆ నీటిని ప్రేమ గా "సరస నీరు" అని వర్ణిస్తాడు. ఇది ఒక కారణం.

రొండోది ఏమిటంటే...తెలుగు ప్రాంతం లో ఉన్న సంభాషణలను సంస్కృతీకరించడం ఒకటి. ఆ విశేషం ఏమిటంటే... మనం తరచూ "హమ్మయ్య బ్రతికి పోయాం" అనడం అంటూ ఉంటాము. సంస్కృత  లో  అలా అనడం ఉండదు. ఆయన మన తెలుగు మాటను "హంత! మాతర్జీవామి" అంటాడు. అలాగే ఇంకో ఉదాహరణ తీసుకుంటే..మనం "పిల్లల తండ్రి" అనే మాట వాడుతూ ఉంటాము.  ఆయన దానిని "వత్సయో: పితు:" సంస్కృతంలో అనే మాట.

మూడో కారణం ఆయన ఇంటిపేరు: "ఉదుంబర నామనో బ్రహ్మ వాదిన:" ఉదుంబరం అంటే మేడి చెట్టు. తెలుగు వారికి తప్ప ఇతరులకు ఇంటి పేర్లు ఉండవు కదా.. ఈ ఇంటి పేరు అందరూ అంగీకరించారు.


కనుక భవభూతి తెలుగు వాడనీ, కరీం నగర్ 
, నిజామాబాద్ ప్రాంత వాసి అనీ భావించదగును.  ఈయన వర్ణించిన ధర్మ పురి కరీం నగర్ జిల్లా లో ఉంది. ఆ ధర్మ స్తలి లో ఎందరో మహాకవులు జన్మించారు.


ఇలాంటి పరిశోధనలు తెలుగులో దాదాపు ఆగి పోయాయి. ఎంతసేపూ ఆ పుస్తకం ఈ పుస్తకం చూసి రాసే పీ.హెచ్.డీ లే ఎక్కువ. 

ఏది ఎమైనా అంత పెద్ద మహాకవి, అందునా సంస్కృత నాటక సాహిత్య వినీలాకాశం లో కనిష్టికాధిష్టితుడైన  కాళిదాసు ప్రక్కన, భవభూతి మహా కవి అనామికాధిష్టితుడు కావడం తెలుగు వారికి గర్వకారణం అని నా ఉద్దేశ్యం.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా సంతోషకరం. కానీ భవభూతి తాను తెలుగువాణ్ణని స్పష్టంగా ఎందుకు వ్రాసుకోలేదో ? స్పష్టంగా వ్రాసుంటే మనకు ఈ డికెష్టీకి దిగే బాధ తప్పేది కదా ?

తెలుగు వారి బ్లాగులు చెప్పారు...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

Ennela చెప్పారు...

Very proud to know this...very good narration

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

శుభస్య శీఘ్రం - అయ్యా మీ తలపే మా తలపు.. కానివ్వండి.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

తెల్గు వారి బ్లాగ్సు తెరదీసి జూపగ
దీక్ష బూని సాగె ధీర జనులు
గట్టి పనులు యెపుడు వట్టిగ బోవంద్రు
సర్వ జనులు మెచ్చు నుర్వి యందు!