• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

29, నవంబర్ 2012, గురువారం

ఒక సుభాషితము


శ్లో! రాజవత్పుత్త్ర దారాశ్చ స్వామివన్మిత్త్ర బాంధవా:
ఆచార్యత్స భామధ్యే భాగ్య వంతం స్తువంతి:

తా! భాగ్యవంతుడైనచో భార్య, పిల్లలు రాజును జూచునట్లునూ..స్నేహితులూ బంధువులూ దేవుని లేక ప్రభువును జూచినట్లూ..సభలలో మతాచార్యుని జూచునట్లునూ కొనియాడెదరు.

ఇంకో విషయం ఇక్కడ చూద్దాము.. కాబట్టే..సుభద్ర గర్భవతి గా ఉన్నప్పుడు కుంతీ దేవి కి నమస్కరిస్తే.. అవిడ ఏమన్నదో తెలుసునా.. "భాగ్యవంతం ప్రసూయేధా మా శూరం మాచ పండితం.  కూరాశ్చ కృతవిద్యాశ్చ మమ పుత్రా వసంగతా:" అన్నది. అంటే.. అమ్మాయీ నీవైనా ఒక భాగ్యవంతుడైన కొడుకుని కను.. కానీ శూరుడూ.. పండితుడూ అయిన కొడుకుని కనవద్దు. ఇదేమి విపరీతపు కోరిక అంటావేమో.. నా కొడుకులకన్నా..శూరులు పండితులు ఉన్నారా? అయినా భాగ్యం లేక పోవడం వల్లనే కదా వారు అడవుల పాలయ్యారు. అందుచేత భాగ్యవంతుడైన కొడుకు పుట్టాలని కోరుకో తల్లీ అంది.

కామెంట్‌లు లేవు: